Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుఒకే వేదికపై ఇద్దరు గండ్రలు

ఒకే వేదికపై ఇద్దరు గండ్రలు

ఉప్పు నిప్పులా ఉండే నేతలు ఒకే సభలో..
విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు
స్పాట్ వాయిస్, రేగొండ : ఒకే వేదికపై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి గండ్ర సత్యనారాయణ రావు ఆసీనులయ్యారు. నిత్యం ఉప్పు నిప్పులా ఉండే వీరు.. ఓకే సభా వేదికను పంచుకోవడంపై జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ అనూహ్య ఘటన రేగొండ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గోరికొత్తపల్లి గ్రామంలో బుధవారం ఆరె క్షత్రియ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి గండ్ర సత్యనారాయణ రావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆసీనులయ్యారు. సభలో ఎడమోహం పెడమోహం లాగే సాగిన.. అధికార, ప్రతిపక్ష నాయకులు వీరిని ఒకే వేదికపై చూసి ముచ్చటపడ్డారు.

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments