నగరంలో హత్య..
తాగిన మైకంలో ఘాతుకం
ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి
విచారణ చేస్తున్న పోలీసులు
స్పాట్ వాయిస్, వరంగల్ : తాగిన మైకంలో నలుగురు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. వివరాలు.. ఆదివారం అర్థరాత్రి వరంగల్ లక్ష్మీపురం బస్టాండ్ సమీపంలోని వెంకటరమణ బార్ వెనకాల ప్రాంతంలో కొందరు వ్యక్తులు మద్యం సేవించారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, నలుగురు వ్యక్తులు తాగిన మైకంలో యాకయ్య అనే వ్యక్తిని బండరాయితో మోది చంపినట్లు తెలుస్తోంది. కాగా, బస్టాండ్ ప్రాంతం నుంచి ఇళ్లకు వెళ్తున్న కొందరు దాడిని గమనించి 108కి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని యాకయ్యను ఎంజీఎం తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం. కాగా, ఏసీపీ గిరిధర్ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. కాగా, మృతుడి భార్య ఈ మధ్యన చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments