Sunday, April 20, 2025
Homeలేటెస్ట్ న్యూస్అగ్ని ప్రమాదం దురదృష్టకరం

అగ్ని ప్రమాదం దురదృష్టకరం

బాధితులకు అండగా ఉంటా
మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
కేటీపీపీ దుర్ఘటనలో గాయపడ్డ కార్మికులకు పరామర్శ
స్పాట్ వాయిస్, గణపురం: భూపాలపల్లి కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో గత సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరమని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఆదివారం సిరికొండ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. క్షతగాత్రుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారో, తాము అలాగే బాధపడుతున్నామన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏదైనా అవసరం ఉంటే సమాచారం అందించాలని, అండగా ఉంటానంటూ కార్మికులకు మనోధైర్యాన్ని కల్పించారు. అదేవిధంగా మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments