Sunday, April 20, 2025
Homeక్రైమ్అత్తింటి వారి దాడి.. అల్లుడు మృతి

అత్తింటి వారి దాడి.. అల్లుడు మృతి

స్పాట్ వాయిస్, కొత్తగూడ: అత్తారింటి వారి దాడిలో అల్లుడు మృతి చెందాడు. ఈ ఘటన కొత్తగూడ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వెలుబెల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో అత్తింటి వారు దాడి చేశారు. ఈ ఘటనలోఐరెండ్ల యాదగిరి(35) అనే వ్యక్తి మృతి చెందాడు. యాదగిరి అదే గ్రామానికీ చెందిన రాసాల సోమయ్య సమ్మక్క  కూతురు రాసాల స్వప్నను పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. కొద్దికాలం తరువాత అత్తగారింటి తరపు నుంచి నిత్యం కలహాలు జరుగుతుండేవి, ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో అత్త, మామ దాడి చేయగా యాదగిరి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments