Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలునర్సంపేటలో ఇఫ్తార్ విందు

నర్సంపేటలో ఇఫ్తార్ విందు

సయ్యద్ అబ్దుల్ హసన్ నవ్వి పబ్లికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు

హాజరైన ఏసీపీ ఫణీందర్
స్పాట్ వాయిస్ నర్సంపేట: హన్మకొండకు చెందిన సయ్యద్ అబ్దుల్ హసన్ లబ్బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో శనివారం ముస్లింలకు ఇస్తారు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట ఏసీపీ ఫణీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి జీవించాలన్నారు. అప్పుడే సర్వమత సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలతో కలిసి ఇస్తారు విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సయ్యద్ అబ్దుల్ హసన్ నవ్వి మాట్లాడుతూ.. తమ ఆహ్వానాన్ని మన్నించి కులమతాలకు అతీతంగా హాజరైన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకుడు జావీద్, పట్టణ సీఐ పులి రమేష్ గౌడ్, ఐఎంఏ ప్రతినిధులు పట్టణానికి చెందిన పలువురు వైద్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments