Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుఢిల్లీలో ఓరుగల్లు నేతలు

ఢిల్లీలో ఓరుగల్లు నేతలు

కేంద్రం మెడలు వంచుతామంటున్న మంత్రి ఎర్రబెల్లి
స్పాట్ వాయిస్, హన్మకొండ: యాసంగి ధాన్యం కొనుగోలు కోట్లాట ఢిల్లీ చేరింది. సోమవారం చేపట్టే ధర్నా కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు తరలివెళ్లారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, వాసుదేవరెడ్డి, తదితరులు ఢిల్లీబాట పట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..
సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రం మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసే దాకా వదిలేది లేదని చెప్పారు. ఢిల్లీ ధర్నాతోనైనా కేంద్రం దిగి వస్తుందని ఆశిస్తున్నామన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments