Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుకన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం
గండ్ర దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు

స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే గండ్ర దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణం సందర్భంగా ముందస్తుగా గండ్ర దంపతులు ప్రత్యేక నిధులు కేటాయించి ఆలయంలో అభివృద్ధి పనులను చేయించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో స్వామి వారికి వెండి ఆభరణాలు తొడుగులు, కవచాలు, కిరీటాలు, పాదుకలు కానుకలుగా సమర్పించడం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో ఆలయానికి తీసుకురాగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెండి ఆభరణాలు స్వామి వారికి అలంకరించారు. ఆదివారం ఉదయం గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తలంబ్రాలు తీసుకొచ్చారు. గండ్ర దంపతులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా వేదపండితులు కళ్యాణాన్ని వైభవంగా జరిపారు. ఈ క్రతువుని తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరు అయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ , కమిటీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శి, యూత్ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments