Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలురమణీయం రాములోరి కళ్యాణం

రమణీయం రాములోరి కళ్యాణం

రమణీయం రాములోరి కళ్యాణం
స్పాట్ వాయిస్ కాజీపేట : కాజీపేట మండలం మడికొండ మెట్టుగుట్టపై శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కన్నులపండుగగా జరిగింది. స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, హోమం, బలిహరణ నిర్వహించారు. అనంతరం భక్తులకు మాడిశెట్టి రాజేష్ కుమార్ జ్ఞానేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఆలయ కార్యనిర్వహణాధికారి శేషుభారతి ,. అర్చకులు పరాశరం విష్ణువర్ధనాచార్యులు, రాగిచెడు అభిలాష్ శర్మ, సత్యనారాయణ శర్మలు నిర్వహించారు. ఈ వేడుకలో వరంగల్ పీడీఎం జడ్జీ భవాని, 46, 64, 45వ డివిజన్ కార్పొరేటర్లు మునిగాల సరోజన కరుణాకర్, ఆవాల రాధిక రెడ్డి, ఇండ్ల నాగేశ్వరరావు, మడికొండ రాంపూర్ గ్రామాల అన్ని స్థాయిల డివిజన్ వివిధ శాఖల అధ్యక్షులు నాయకులు ప్రజలు పాల్గొని స్వామివారికి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అభయ ఆంజనేయ దేవస్థానంలో
మడికొండ ఎస్సీ కాలనీలోని శ్రీ అభయ ఆంజనేయ దేవస్థానంలో సీతారామచంద్రస్వామి కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గడ్డం శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ తోట్ల రాజు యాదవ్, వెంకటస్వామి, బాబు, మోహన్, సతీష్, వినయ్, సాయి, వంశీ, సునీల్, రేవంత్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments