Friday, September 20, 2024
Homeక్రైమ్ప్రాణం తీసిన చేపల వేట..

ప్రాణం తీసిన చేపల వేట..

ప్రాణం తీసిన చేపల వేట
యువకుడి మృతి
నలుగురిపై కేసు నమోదు..
స్పాట్ వాయిస్, చిట్యాల : భూపాలపల్లి జిల్లా లో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో చేపలు పట్టొచ్చని వెళ్లిన ఐదుగురిలో ఒకరు కరెంట్ షాక్ కు గురై మృతి చెందాడు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పాశిగడ్డతండాకు చెందిన చెందిన లావుడ్య భద్రు, లావుడ్య రాజు, లావుడ్య రఘు, లావుడ్య తిరుపతి, లావుడ్య నవీన్ చేపల వేట కోసం శనివారం గ్రామ సమీపంలోని మోరంచవాగుకు వెళ్లారు. నీటిలో విద్యుత్ వైర్లను వేసి చేపలను ఈజీగా పట్టుకోవాలని ఐదుగురు ఆలోచించారు. ఇందుకోసం వైర్లను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా లావుడ్య నవీన్ నీటిలో విద్యుత్ వైర్లను సరి చేస్తుండగా ఒడ్డున కొంతమంది వైర్లను విద్యుత్ కు కనెక్షన్ ఇచ్చారు. దీంతో నీటిలో ఉన్న నవీన్ కు షాక్ రావడంతో నీటిలోనే చనిపోయాడు. ఈ విషయంపై మృతుడి తల్లి అమ్మక్క పోలీసులకు ఫిర్యాదు చేయగా చేపల వేటకు వెళ్లిన మిగతా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments