Thursday, September 19, 2024
Homeక్రైమ్ఎంజీఎంలో హహాకారాలు

ఎంజీఎంలో హహాకారాలు

ఎంజీఎంలో అహకారాలు
నలుగురికి చేరిన మృతుల సంఖ్య..
మరో ఇద్దరు సీరియస్

స్పాట్ వాయిస్, ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి హహాకారాలతో నిండిపోయింది. రోదనలు మిన్నంటుతున్నాయి. హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని కస్తూర్బా స్కూల్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతుల బంధువులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యుల తో ఎంజీఎం నిండిపోయింది. ఆస్పత్రి అంతా విషాదం నెలకొంది.

శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళా కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఓ గ్రామంలో మిర్చి వేరెందుకు శుక్రవారం ఉదయాన్నే మొగుళ్లపల్లికి చెందిన ట్రాలీ లో బయలుదేరారు. పత్తిపాక నుంచి మాందారిపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీ ట్రాలీని సైడ్ నుంచి ఢీకొట్టింది. ట్రాలీలో సైడ్ నిలబడిన కూలీలను బలంగా గుద్దుకుంటూ వెళ్లడంతో ముగ్గురు అక్కడి కక్కడే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మృతులు వీరే..
బాబు రేణుక ₹42)
చల్లా ఐలుకొమురమ్మ(50)
దండెబోయిన విమల(45)
పూల మంజూల(47)

RELATED ARTICLES

Most Popular

Recent Comments