Tuesday, June 17, 2025
Homeజిల్లా వార్తలుఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

స్పాట్ వాయిస్, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఆదివారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ చేతుల మీదుగా అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులందరికీ ఇళ్లు వస్తాయని గ్రామ పార్టీ అధ్యక్షుడు అన్నారు. అదేవిధంగా మండలంలోని లింగాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి మామిండ్ల కుమారస్వామి, ఉద్యమకారుడు, కాంగ్రెస్ యువ నాయకుడు మామిండ్ల ఐలయ్య, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు మామిండ్ల పోశాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి కుమార్ స్వామి, అశోక్, మాజీ వార్డు మెంబర్ నాన్నబోయిన కొమురయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments