మంత్రివర్గoలో ఆ ముగ్గురికి చోటు..
స్పాట్ వాయిస్, బ్యూరో : కేబినెట్లో ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న ఆరు స్థానలలో మూడు బెర్తులను భర్తీ చేసారు. కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి) పేర్లు ఖరారయ్యాయి. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు అందింది. కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం 12:19 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక శాసనసభ ఉపసభాపతిగా రామచంద్రనాయక్కు అవకాశం లభించింది.
Recent Comments