Sunday, June 8, 2025
Homeలేటెస్ట్ న్యూస్బీఆర్‌ఎస్‌ లో తీవ్ర విషాదం

బీఆర్‌ఎస్‌ లో తీవ్ర విషాదం

బీఆర్‌ఎస్‌ లో తీవ్ర విషాదం

ఎమ్మెల్యే మాగంటి కన్నుమూత

స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్‌ఎస్‌ లో తీవ్ర విషాదం నెలకొంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 5న తీవ్రమైన ఛాతీనొప్పితో ఏఐజీ దవాఖానలో చేరారు. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్‌ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. గోపీనాథ్‌కు భార్య సునీత, కుమారుడు వాత్సల్యనాథ్‌, కుమార్తె అక్షరనాగ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments