Sunday, June 8, 2025
Homeక్రైమ్మేడిగడ్డలో ఆరుగురి గల్లంతు..

మేడిగడ్డలో ఆరుగురి గల్లంతు..

అంతా 19ఏళ్లలోపు పిల్లలు..
శోకసంద్రలో తల్లిదండ్రులు..
అంబటిపల్లి, కొరుకుంట గ్రామంలో తీవ్ర విషాదం
గజఈతగాళ్లను పిలిపించే పనిలో పోలీసులు
స్పాట్ వాయిస్, మహదేవపూర్: ఎంతటి శోకం. ఒక్కరుకాదు.. ఇద్దరు కాదు.. ఆరుగురు పిల్లులు. అంతా 19ఏళ్లలోపు వారే. స్కూళ్లు, కాలేజీలు స్టార్ట్ అవుతాయని, సెలవుల చివరి రోజుల్లో ఆనందంగా గడుపుదామని వచ్చారో.. లేక.. మేడిగడ్డ బ్యారేజీ చూద్దామని వచ్చారో కాని.. వారికి అవే చివరి గడియలు అయ్యాయి. 8మంది పిల్లలు రాగా.. నదిలోకి దిగిన పిల్లల్లో ఒకరి వెనక ఒకరు ఆరుగురు గల్లంతు అయ్యారు. ఈ విషాద వార్త గ్రామంలోకి చేరడంతో.. ప్రజలంతా భారీగా చేరుకున్నారు. తల్లిదండ్రులు కన్నీటి సంద్రంతో అక్కడి హృదయాలన్నీ బరువెక్కాయి. వివరాల్లోకి వెళ్తే.. మహదేవపూర్ మండలం
అంబటిపల్లి గ్రామానికి చెందిన యువకులు నలుగురు, మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గోదావరిలో శనివారం సాయంత్రం స్నానికి వెళ్లగా.. ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు అయ్యారు. పట్టి వెంకటస్వామి ఇద్దరు కుమారులు పత్తి మధుసూదన్ (18) పట్టి శివ మనోజ్ (15) తోకరి రాజు కుమారుడు తొగరి రక్షిత్(13) కర్నాల సమ్మయ్య కుమారుడు కర్నాల సాగర్ (16) కొర్లకుంట గ్రామానికి చెందిన పండు (18) రాహుల్ (19) గోదావరి స్నానానికి వచ్చి గల్లంతు అయ్యారు. సంఘటన స్థలాన్ని మహాదేవపుర్ ఎస్సై పవన్ కుమార్ పరిశీలిస్తున్నారు. గల్లంతమైన యువకుల కోసం గాలింపు చర్యల కోసం గజఈతగాళ్లను రప్పిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments