ప్రాణం తీసిన పల్లి గింజ
స్పాట్ వాయిస్, మానుకోట: పల్లి గింజ పసివాడి ప్రాణం తీసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్పల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాయక్పల్లికి చెందినగుండెల వీరన్న, కల్పన దంపతులకు కుమారుడు అక్షయ్ శివ ప్రేమ్కుమార్ ఈ నెల 7న ఇంట్లో ఉన్న పల్లి గింజను మింగాడు. పొరబోయి బాలుడు దగ్గుతుండగా గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఎక్స్రే తీయించగా పల్లి గింజ గొంతులో కాకుండా ఊపితిత్తుల్లోకి చేరిందని గుర్తించారు. రెండు రోజులుగా ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాలుడు శ్వాస ఆడక ఆదివారం ఉదయం మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు.
Recent Comments