జయశంకర్ జిల్లాలో ఘోర ప్రమాదం
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం రాంపూర్ గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మీనాజీపేటకు చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబపూర్ కు చెందిన సతీష్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం వంద పడకల ఆస్పత్రికి తరలించారు.
రెండు బైక్లు ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్..
RELATED ARTICLES
Recent Comments