Monday, June 2, 2025
Homeటాప్ స్టోరీస్మండలంగా మల్లంపల్లి

మండలంగా మల్లంపల్లి

జీవో విడుదల చేసిన ప్రభుత్వం
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలోని మల్లంపల్లి నూతన మండల కేంద్రంగా ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. ములుగు మండలంలోని మల్లంపల్లి, రామచంద్రాపురం రెవెన్యూ గ్రామాలు, వాటి పరిధిలోని శ్రీనగర్‌, భూపాల్‌నగర్‌, శివతండా, మహ్మద్‌గౌస్‌పల్లి, దేవనగర్‌, ముద్దునూరుతండా, గుర్తూరుతండాలతోపాటు పలు గ్రామాలు మల్లంపల్లి మండలంలో కలువనున్నాయి. మల్లంపల్లిని మండలంగా చేయడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మల్లంపల్లి మండలం ప్రకటిస్తూ జీవో విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు అని నిరూపించడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments