స్పాట్ వాయిస్, గణపురం:రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంచపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బండారి శిరీష్ చెల్పూర్ లో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం భూపాలపల్లిలో జరిగిన ఒక ఫంక్షన్ కు వెళ్ళి తిరిగి చెల్పూర్ కు వస్తున్న క్రమంలో కేటీపీపీ సమీపంలో రోడ్డు డివైడర్ కు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శిరీష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనంలో భూపాలపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా శిరీష్ పరిస్థితి విషమంగా ఉండంతో వైద్యుల సూచన మేరకు వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి కి తరలించారు. శిరీష్ కు భార్య, సంవత్సరం పాప ఉందని స్థానికులు తెలిపారు.
Recent Comments