టిప్పర్-బైక్ ఢీ
స్పాట్లో ఒకరు మృతి
ఇద్దరి పరిస్థితి విషమం
భూపాలపల్లి జిల్లాలో ఘటన
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ టిప్పర్ లారీని ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన భూపాలపల్లి మండలంలోని పెద్దాపురం గ్రామ సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపురం మండలం పరుశరాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జంగుపల్లి గ్రామానికి చెందిన పేరాల వెంకటేశ్, జక్కరాజు జస్వంత్, వేముల బన్ని అనే ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై సమీప గ్రామమైన పెద్దాపురానికి వెళ్లి వస్తుండగా ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ లారీని ఢీకొట్టారు. దీంతో బైక్ ఉన్న పేరాల వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. జస్వంత్, బన్నీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో భూపాలపల్లికి తరలించారు.
టిప్పర్-బైక్ ఢీ
RELATED ARTICLES
Recent Comments