Sunday, September 29, 2024
Homeలేటెస్ట్ న్యూస్కాజీపేట లో బాలుడు కిడ్నాప్...

కాజీపేట లో బాలుడు కిడ్నాప్…

లబో దిబోమంటున్న తల్లిదండ్రులు…
స్పాట్ వాయస్, కాజీపేట: కాజీపేటలో ఓ బాలుడు కిడ్నాప్ కు గురైన ఘటన శనివారం కలకలం సృష్టించింది. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం..వరంగల్ కరీమాబాద్- రంగశాయిపేటకు చెందిన నిరుపేద ముస్లిం దంపతులు (ఎస్.కె మసూద్, కౌసర్) తమ ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అయాన్ (5), చిన్న కొడుకు ఇఫాన్ (3). వీరిని తీసుకొని జనగామకు వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం కాజీపేటకు చేరుకున్నారు. ఆ సమయంలో రైళ్లు లేకపోవడంతో రైల్వే ఇనిస్టిట్యూట్ గేటు వద్ద కొంచెం సేపు వేచి ఉన్నారు. భార్య కౌసర్ చిన్న కొడుకు ఇస్తారును ఎత్తుకొని అన్నం తెచ్చేందుకు చౌరస్తా వరకు వెళ్లింది. భర్త మసూద్ తమ బ్యాగ్ పట్టుకొని రైల్వే స్టేషన్ వైపుకు వెళ్లాడు. ఇఫ్తాన్ అక్కడే ఉండగా అదే ప్రాంతంలో కొంత సమయం వేచి ఉన్న ఓ ముస్లిం దంపతులు వారి పెద్ద కొడుకు అయాన్‌ను  ఆటోలో తీసుకొని వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కొంతసేపటి తర్వాత భార్యాభర్తలిద్దరూ రైల్వే ఇన్స్టిట్యూట్ గేటు వద్దకు వచ్చి చూడడంతో తమ కుమారుడు కనిపించక పోవడంతో లబోదిబోమంటూ స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ తల్లిదండ్రులు రోదిస్తూ తెలిపారు.

 

కి

RELATED ARTICLES

Most Popular

Recent Comments