Monday, September 23, 2024
Homeటాప్ స్టోరీస్ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్..

ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్..

ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్..
అత్యుత్సాహం ప్రదర్శిచొద్దు..
4 గంటల నుంచి 6 వరకు ప్రజలను కలవాలి..
స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. జాగ్రత్తగా మెలగాలని వారికి సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. ప్రతీ ఎమ్మెల్యే సాయంత్రం 4.00 గంటల నుంచి 6.00 గంటల వరకు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు సమయం కేటాయించాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొట్టే విధంగా సన్నద్దంగా ఉండాలని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. బీసీ జనగణన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. త్వరలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్డు ఆధారంగానే ఆ ఫ్యామిలీకి సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments