Monday, September 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్నిలబెట్టిన చోటే..నిమజ్జనం..

నిలబెట్టిన చోటే..నిమజ్జనం..

అపూర్వ ఘట్టం తిలకించేందుకు భారీగా తరలివచ్చిన జనం
రూ.2,26,116 పలికిన లడ్డూ
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎల్లంబజార్​లో ప్రతిష్టించిన 40 అడుగుల మట్టి గణపతికి ఆదివారం నిమజ్జనం నిర్వహించారు. 15 రోజుల పాటు గణపయ్యకు విశేష పూజలు నిర్వహించారు. చివరి రోజు నిర్వహించిన వేలం పాటలో లడ్డూ రూ.2,26,116 పలికింది. గణపతి ఉత్సవ సమితి సభ్యులు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో వినాయకుడిని ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్థానిక పోలీసులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments