Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుఆర్ ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక

ఆర్ ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక

ఆర్ ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా కర్రు సంపత్
శుభాకాంక్షలు తెలిపిన కమిటీ సభ్యులు, గ్రామస్తులు

స్పాట్ వాయిస్, హన్మకొండ : హన్మకొండ జిల్లా ఆర్ ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా కర్రు సంపత్ ఎన్నికయ్యరు. హన్మకొండ ఏకశిలా పార్కులో జిల్లా పరిధిలోని 14 మండలాల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శలు సమావేశమై జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా కర్రు సంపత్, గౌరవ అధ్యక్షుడిగా సారంగపాణి, కార్యదర్శిగా అగస్టాన్, కోశాధికారిగా కదివెండి రమేష్, ఉపాధ్యక్షుడిగా శివుడు ఎన్నికయ్యారు. మిగతా జిల్లా కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని అసోసియేషన్ నాయకులు తెలిపారు. శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన కర్రు సంపత్ 30 ఏళ్లుగా ఆర్ ఎంపీగా సొంత గ్రామంతోపాటు చుట్టు పక్కల ఐదారు గ్రామాల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తూ పలువురి మన్ననలు పొందారు. ఆయన సేవలను గుర్తించిన తోటి ఆర్ ఎంపీ, పీఎంపీలు ఆయనను జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కర్రు సంపత్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సేవలందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలన్నారు. అర్హులకు ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో అవకాశం కల్పించాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్‌ ఇవ్వాలని అన్నారు. ఆర్ఏంపీ, పీఎంపీలు అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారని, వారికి వైద్యం అందించడంలో కృషి చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వ అధికారుల దాడులను నిలిపివేయాలని కోరారు. ముఖ్యంగా ఇటీవల కరోనా సమయంలో ఆర్ ఎంపీ, పీఎంపీల వైద్య సేవలు మరువలేనివన్నారు. ప్రభుత్వం తరఫున ఆర్ఎంపీ, పీఏంపీలకు సంపూర్ణ సహకారం అందివ్వాలని కోరారు. కాగా, జిల్లా కమిటీ ఎన్నికకు సహకరించిన మండల నాయకులకు, సీనియర్ నాయకులకు కమిటీ తరపున నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కాగా సంపత్ ఎన్నికపై కమిటీ సభ్యులు, జిల్లాలోని ఆర్ ఎంపీ, పీఎంపీలు, గ్రామస్తులు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments