Thursday, September 19, 2024
Homeజిల్లా వార్తలుబాధితులకు సెల్ ఫోన్ అప్పగింత..

బాధితులకు సెల్ ఫోన్ అప్పగింత..

స్పాట్ వాయిస్ కాజీపేట: సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు ఆదివారం మడికొండ సీఐ సెల్ ఫోన్లు తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా సీఐ పుల్యాల కిషన్ మాట్లాడుతూ.. మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు మీసేవ ద్వారా అప్లికేషన్ చేసుకోగా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ తో 6 సెల్ ఫోన్ లో వెతికి పట్టుకొని బాధితులకు అప్పగించామన్నారు. పోగొట్టుకున్న వారు మడికొండకు చెందిన భోగి కుమారస్వామి, వీరస్వామి, జితేందర్, కొమురయ్య, కడిపికొండ శంకరయ్య, తరాలపెళ్లి ప్రవీణ్‌కు సెల్ ఫోన్ అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సెల్ ఫోన్లు ఎవరైనా పోగొట్టుకుంటే వెంటనే మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజబాబు కానిస్టేబుల్ సంపత్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments