Friday, September 20, 2024
Homeతెలంగాణమండలి ప్రతిపక్షనేతగా సిరికొండ

మండలి ప్రతిపక్షనేతగా సిరికొండ

స్పాట్ వాయిస్, గణపురం: శాసనమండలిలో ప్రతిపక్షనేతగా సిరికొండ మధుసూధనాచారి నియమితులయ్యారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారిని ప్రతిపక్షనేతగా నియమించాలని భారత రాష్ట్ర సమితి గతంలో కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్​ అధినేత, శాసనసభాపక్ష నేత కేసీఆర్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న మండలి చైర్మన్, ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు బుధవారం బులెటిన్ జారీ చేశారు. ప్రతిపక్ష నేత నియామకం బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments