Thursday, September 19, 2024
Homeక్రైమ్పిడుగు పాటుతో మహిళ మృతి..

పిడుగు పాటుతో మహిళ మృతి..

భూపాలపల్లిలో విషాదం..

పిడుగు పాటుతో మహిళ మృతి..

వ్యవసాయ పనులు చేస్తుండగా ఘటన..

స్పాట్ వాయిస్, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. భూపాలపల్లి మండలంలోని శ్యామ్ నగర్ గ్రామంలో పిడుగుపాటుతో మహిళ మృతి చెందిoది. శనివారం వ్యవసాయ పనులలో భాగంగా మిరప నారు పెడుతుండగా ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతోపాటు పిడుగుపాటుకు గురై పొనగంటి సులోచన(44) అక్కడికక్కడే మృతి చెందింది. సులోచనతో పాటు మరో ముగ్గురు పనిచేస్తుండగా వారు తీవ్ర అస్వస్థతకు గురవడంతో సమీపంలో ఉన్నవారు ఆసుపత్రికి తరలించారు. కాగా చనిపోయిన సులోచనకు భర్తతోపాటు కూతురు కొడుకు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments