Friday, September 20, 2024
Homeటాప్ స్టోరీస్20 నిమిషాల్లో రైతులకు రుణం..

20 నిమిషాల్లో రైతులకు రుణం..

20 నిమిషాల్లో రైతులకు లోన్..

రైతుల కోసం కేంద్రం కీలక నిర్ణయాలు 

7 పథకాలకు రూ.13,966 కోట్లు..

ఆమోదించిన కేద్ర మంత్రి వర్గం

స్పాట్ వాయిస్, డెస్క్: రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  మోడీ  సర్కార్  రైతులకు సంబంధించిన 7 కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ పథకాలకు రూ.13,966 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలోనే రైతులకు సత్వరమే లోన్లు ఇచ్చేందుకు పథకాన్ని ప్రకటించింది. కేవలం 20 నిమిషాల్లోనే రైతులకు రుణాలు అందించేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కేంద్రం తీసుకువస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌కు రూ.2,817 కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగానికి టెక్నాలజీని అనుసంధానం చేయడంలో భాగంగానే ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

7 పథకాలకు రూ.13,966 కోట్లు

*డిజిటల్ అగ్రికల్చర్ మిషన్- రూ.2,817 కోట్లు

*క్రాప్​ సైన్స్ పథకం- రూ.3,979 కోట్లు

*వ్యవసాయ విద్యా రంగం బలోపేతం- రూ. 2,291 కోట్లు

*పాడిపశువుల ఆరోగ్యం, ఉత్పత్తి పథకం- రూ. 1,702

*హార్టికల్చర్ అభివృద్ధి- రూ.860 కోట్ల

*కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం- రూ. 1,202 కోట్లు

*సహజ వనరుల నిర్వహణ- రూ. 1,115 కోట్లు

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్

దేశంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ రైతులకు మరింత మేలు చేసేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకువచ్చినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా 20 నిమిషాల్లోనే రైతులు రుణాలు పొందే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తుందని తెలిపారు. అంతేకాదు 2047 నాటికి వాతావరణ పరిస్థితులను తట్టుకుని పంటలు పండించేలా రైతులను సిద్ధం చేయడం వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ బలోపేతానికి రూ.2,291 కోట్లతో ప్రణాళిక రచించింది. ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా పరిశోధనలు చేయాలని సూచించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments