Saturday, September 21, 2024
Homeటాప్ స్టోరీస్వాల్మీకి’ బంధం..?!

వాల్మీకి’ బంధం..?!

వాల్మీకి’ బంధం..?!
కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య రహస్య ఒప్పందం..
స్వయంగా సీఎం చెప్పినా పట్టింపేది..?
కేంద్రం మౌనం వెనక అర్థమేంటి..
తెలంగాణ అకౌంట్ల వివరాలు బయటపెట్టాలి..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
కర్ణాటక వాల్మీకి స్కాంపై సెంట్రల్ సర్కార్ కు సూటి ప్రశ్నలు..
రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్
స్పాట్ వాయిస్, బ్యూరో : ’కర్ణాటక వాల్మీకి స్కాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కూడా ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఇక్కడి సీఎం రేవంత్ మీడియాను మ్యానేజ్ చేస్తూ విషయాలు బయటకు రాకుండా ఆపుతున్నారు. ఆ మబ్బులు కూడా నాలుగైదు రోజుల్లో వీడిపోయాయి. గవర్నమెంట్ సొమ్ము అక్రమంగా ఎటువంటి కారణం లేకుండా ఎంపీ ఎన్నికలక ముందు రూ. 180 కోట్లు దారి మళ్లించారు. వాల్మీకి స్కాంలో డబ్బులు దారిమళ్లినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయమై కేంద్రం మౌనం వెనుక అర్థం ఏంటి’ అని బీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఛానెల్ వేదికగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు..

కదులుతన్న డొంక
కర్ణాటకలో వాల్మీకి స్కామ్ తీగ లాగితే డొంకంతా తెలంగాణ కాంగ్రెస్ నేతల వైపు కదులుతోందని కేటీఆర్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణలోని కీలకమైన కాంగ్రెస్ నేతల హస్తం ఉన్నట్లు ఆధారాలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు దాదాపు రూ. 180 కోట్లు ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ అకౌంట్ల నుంచి ఏ కారణం లేకుండా అక్రమంగా దారి మళ్లిందన్నారు. ఈ సొమ్ము అంతా ఎవరికీ ఖాతాలోకి బదిలీ అయిందో ప్రజలకు తెలియాలని, అందులో రూ. 45 కోట్లు హైదరాబాద్ లోని 9 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారన, ఆ బ్యాంక్ ఖాతాలు ఎవరివో తేల్చాలని కేటీఆర్ కోరారు. ఈ వ్యవహారం బయటకు రాగానే వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ సూసైడ్ చేసుకోవటం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు. వీ6 పేరుతో ఉన్నబిజినెస్ సంస్థ కు రూ. 4.5 కోట్లు బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయని, అ సలు ఆ సంస్థ యాజమాని ఎవరో ప్రజల ముందుంచాలన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బే తమ ఎన్నికల కోసం వాడినట్లుందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

అడ్డుకుంటున్నదెవరు.?
వాల్మీకి స్కామ్ వ్యవహారంలో హైదరాబాద్ లో సెట్, సీఐడీ, ఈడీ దాడులు నిర్వహించినప్పటికీ ఆ సమాచారం మీడియాలో రాకుండా అడ్డుకున్నదెవరని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సహా కీలకమైన కాంగ్రెస్ నేతలు కొంతమంది మీడియాను మేనేజ్ చేసినప్పటికీ మరో నాలుగైదురోజుల్లో అన్ని విషయాలు బయటకొస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బార్లు, బంగారు దుకాణాల నుంచి భారీగా నగదు విత్‌ డ్రా చేసినట్లు సమాచారం ఉందని, ఆ బార్లు, బంగారం దుకాణాలను నడుపుతున్నెదవరు? వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ స్పందించాలి
పార్లమెంట్ లో అవినీతి పై పెద్ద ఎత్తున మాట్లాడే రాహుల్ గాంధీ వాల్మీకి స్కామ్ లో ఎందుకు మౌనంగా ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు. అంటే సొంత పార్టీ నేతలు అవినీతి చేస్తే మాఫీయేనా అని విమర్శించారు. వెంటనే రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందించాలని మొత్తం వ్యవహారంలో ఉన్న పెద్ద చేపల పేర్లు బయటకు రావాల్సిన అవసరముందన్నారు. కర్ణాటక సీఎం సిద్దిరామయ్యను తొలగిస్తే…తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అనటం వెనుక అంతర్యం ఏంటని కేటీఆర్ నిలదీశారు. అంటే కర్ణాటక కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య పెనవేసుకున్న బంధం ఈ వాల్మీకి స్కామేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలున్నట్లు పెద్ద ఎత్తున ఆధారాలు కనబడుతున్నప్పటికీ ఈడీ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడి నేతలు కాపాడుతున్న శక్తులెవరో ప్రజల ముందుంచాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments