Monday, September 23, 2024
Homeక్రైమ్మామను చంపిన అల్లుడు..

మామను చంపిన అల్లుడు..

దాడిలో అత్తకు తీవ్ర గాయాలు..
స్పాట్ వాయిస్, మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని బాలన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేట గ్రామంలో ఆదివారం రాత్రి అల్లుడు అత్తమామలపై దాడి చేయడంతో మామ మృతి చెందాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… గాందర్ల రామకృష్ణ( 37) అదే గ్రామానికి చెందిన గొర్రె నర్సయ్య – నర్సమ్మ రెండో కుమార్తె స్వప్నను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి కుతురు, కొడుకు ఉన్నారు. రామకృష్ణ మరో మహిళను పెళ్ళి చేసుకోవడంతో స్వప్న నాలుగేళ్ల నుంచి రామకృష్ణకు దూరంగా అదే గ్రామంలో తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. ఆదివారం ఉదయం గ్రామంలో ముత్యలమ్మ తల్లికి శ్రవణం పెట్టడం కోసం గ్రామస్తులందరూ ముత్యాలమ్మ గుడి దగ్గర సమావేశం అయ్యారు. అయితే మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ ముత్యాలమ్మ గుడి వద్ద భార్య స్వప్న కనబడడంతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రామక‌ృష్ణ ఎడ్లబండికి ఉన్న కర్రతో స్వప్న పై దాడికి దిగాడు. అయితే అడ్డం వచ్చిన నర్సమ్మ – నర్సయ్యకు కర్ర తగిలి తల పగిలడంతో ఇద్దరు స్పృహ కోల్పోయారు. వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. నర్సయ్య మృతి చెందాడు. నర్సమ్మకు తలకు తీవ్రగాయం కావడంతో గాయాలు కావడంతో అక్కడి నుంచి ఎంజీఎంకు తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగపేట ఎస్సై టీవీఆర్ సూరీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments