Wednesday, May 21, 2025
Homeక్రైమ్విద్యుత్ షాక్‌తో రైతు మృతి..

విద్యుత్ షాక్‌తో రైతు మృతి..

భూపాలపల్లి జిల్లాలో విషాదం..
స్పాట్ వాయిస్, చిట్యాల: వరి నారుకు నీరు పెట్టేందుకు వెళ్లి మోటర్ ఆన్ చేస్తున్న క్రమంలో స్టార్టర్ డబ్బాకు ఉన్న ఇనుప తీగ ద్వారా కరెంట్ సరఫరా కా వడంతో ఓ యువరైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన మండలంలోని ముచినిపర్తి శివారు గుంటూరు పల్లిలో శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మోర్తేల లక్ష్మారెడ్డి (35) గ్రామ శివారులో తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో ఎకరం లో వరి నారును సాగు చేస్తున్నాడు. నారుకు నీరు పెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి.. విద్యుత్ మోటర్ ఆన్ చేస్తుండగా ఇనుప తీగకు ప్రమాదవ శాత్తు విద్యుత్ సరఫరా అయింది. దీంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడేమృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నారుకు నీరు పెట్టేందుకు వెళ్లి ఇంకా ఇంటికి తిరిగిరాక పోవడంతో తండ్రి మల్లారెడ్డి వ్యవ సాయ భూమివద్దకు వెళ్లి చూడగా లక్ష్మారెడ్డి విగతజీవిగా పడి ఉన్నాడు. మృతిడికి భార్య వాణిశ్రీ 3 నెలల కూతురు ఉంది. మృతుడి తండ్రి మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments