Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుబండారుపల్లి గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

బండారుపల్లి గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

వరంగల్ ఎంజీఎంకు తరలింపు
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు మండలం బండారుపల్లి గురుకుల పాఠశాలలో గురువారం అర్ధరాత్రి విద్యార్థి అస్వస్థతకు గురైన సంఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయులు ములుగు ఆసుపత్రిలో చికిత్స అందించి వరంగల్ కు తరలించారు. శుక్రవారం ఉదయం మరో ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత కావడంతో ములుగులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. వారికి నోటి నుంచి నురుగులు గమనించిన వైద్యులు విష పురుగు ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అర్ధరాత్రి ములుగు మండలం పందికుంటకు చెందిన శ్రీకర్ అస్వస్థతకు గురి కాగా, శుక్రవారం గోరి కొత్తపల్లికి చెందిన ప్రణయ్, వెంకటాపూర్ మండలం కేశవాపూర్‌కు చెందిన కార్తీక్‌లు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై విద్యా శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనలో ఉన్నారు. కాగా పాఠశాలలో పాములు, విష పురుగులు సంచరించడంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. సరైన నిర్వహణ లేక పోవడంతో ఈ సంఘటన జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments