వరంగల్ లో దారుణం..
స్పాట్ వాయిస్, వరంగల్: ఆస్తి విషయంలో జరిగిన గొడవలో తమ్ముడు అన్న గొంతు కోశాడు. ఈ ఘటనశుక్రవారం వరంగల్ జిల్లా రంగశాయిపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రంగశాయిపేటకు చెందిన రావుల రాజేశ్ఖన్నా, అతని అన్న రావుల రాజుకు ఆస్తి విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి ఇద్దరు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో తమ్ముడు రాజేశ్ఖన్నా అన్న రాజును బ్లేడ్తో గొంతు కోశాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే స్పందించిన స్థానికులు, బంధువులు ఎంజీఎం రాజను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Recent Comments