Thursday, April 17, 2025
Homeజనరల్ న్యూస్బీఆర్ఎస్ కు కార్పొరేటర్ల షాక్

బీఆర్ఎస్ కు కార్పొరేటర్ల షాక్

బీఆర్ఎస్ కు కార్పొరేటర్ల షాక్

కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు కార్పొరేటర్లు..

స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ తూర్పు లో బీఆర్ ఎస్ కు మరోసారి షాక్ తగిలింది. నియోజకవర్గం పరిధిలోని ముగ్గురు బీఆర్ ఎస్ కార్పొరేటర్లు గురువారం ఓ సిటీ లోని క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సమక్షంలో హస్తం గూటికి చేరారు. వారికి కొండా మురళి కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, పల్లం పద్మ రవి, భోగి సువర్ణ సురేష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఖిలా వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల్ జనార్ధన్, కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments