Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుగురుకుల బిల్డింగ్ పైనుంచి పడిపోయిన విద్యార్థిని..

గురుకుల బిల్డింగ్ పైనుంచి పడిపోయిన విద్యార్థిని..

గురుకుల బిల్డింగ్ పైనుంచి పడిపోయిన విద్యార్థిని..

  కేసముద్రం మండల కేంద్రంలోని గురుకులoలో ఘటన 

స్పాట్ వాయిస్, క్రైమ్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలోని ఓ విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి పడిపోయింది. తీవ్ర గాయాలైన విద్యార్థినిని ప్రిన్సిపాల్ హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. గిరిజన బాలికల గురుకులంలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వారం రోజుల క్రితం ఇంటికి వెళ్ళింది. తిరిగి బుధవారం హాస్టల్లో చేరింది. అదే రోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో గిరిజన బాలికల గురుకులంలోని ఒకటవ అంతస్తు పై నుండి కింద పడింది. ప్రమాదవశాత్తు కింద పడిందా లేక..? భవనం పైనుంచి దూకిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments