Sunday, April 20, 2025
Homeతెలంగాణరఘునాథపల్లిలో ఏసీబీ రైడ్స్..

రఘునాథపల్లిలో ఏసీబీ రైడ్స్..

మాజీ సర్పంచ్ వద్ద బిల్లుల క్లియరెన్స్ కోసం డబ్బుల డిమాండ్..
రూ.20వేలతో పట్టుబడిన పంచాయతీ సెక్రటరీ
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఇందులో రూ.20వేలు లంచం తీసుకుంటూ కంచనపల్లి పంచాయతీ సెక్రెటరీ పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మాజీ సర్పంచ్ కు బిల్లు క్లియరెన్స్ కోసం పంచాయతీ సెక్రెటరీ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో మాజీ సర్పంచ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మాజీ సర్పంచ్ భర్త గవ్వాని నాగేశ్వర రావు పంచాయతీ సెక్రెటరీకి రూ.20వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. సీఐలు ఎస్ రాజు, ఎల్ రాజు తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments