Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్మళ్లీ కూలిన గర్మిళ్లపల్లి - ఓడేడు బ్రిడ్జి గర్డర్లు

మళ్లీ కూలిన గర్మిళ్లపల్లి – ఓడేడు బ్రిడ్జి గర్డర్లు

స్పాట్ వాయిస్, టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి – పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి గర్డర్లు గాలి వాన బీభత్సానికి మరోసారి నేలకూలాయి. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో మానేరుపై నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిన బ్రిడ్జికి సంబంధించి గర్మిళ్లపళ్లి వైపు 17, 18 పిల్లర్ల మధ్యన ఉన్న గర్డర్లు నాలుగు ఒక్కసారిగా కుప్పకూలాయి. పెద్ద శబ్దం అవుతూ గర్డర్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. గర్డర్లు కూలిన సమయంలో వంతెనకు సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. గతంలో ఏప్రిల్ 22న కూడా గాలివాన బీభత్సంతో వంతెనకు సంబంధించిన గర్డర్లు ఓడేడు వైపు మూడు నేల కూలాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments