Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుశ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధిద్దాం

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధిద్దాం

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధిద్దాం

బీజేపీ యువ నాయకుడు డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

స్పాట్ వాయిస్, నర్సంపేట: శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధిద్దామని బీజేపీ జిల్లా నాయకుడు డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలో నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపెళ్లి నర్సింహరాములు అధ్యక్షతన ప్రముఖ పార్లమెంటేరియన్, జాతీయవాది, మాజీ కేంద్ర మంత్రి, జన్ సంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్దంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా నాయకులు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కంభంపాటి పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి, దళిత మోర్చా జిల్లా కో- కన్వీనర్ కూనమల పృథ్వీరాజ్ హాజరై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహి చలేగా అంటూ జాతి జాగృతికై గళమెత్తిన మార్గదర్శి , నిరంతరం దేశం కోసమే తపించిన మహర్షి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. హిందువుల హక్కుల కోసం గొంతెత్తి నినందించిన చైతన్య దీప్తి భారతీయ జన సంఘ్ ని స్థాపించి హైందవ ఏకీకరణకు తోడ్పడిన ఉద్యమ స్ఫూర్తి ఆయన అని అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధించే విధంగా పని చేస్తూ ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట 2 వార్డ్ కౌన్సిలర్ జుర్రు రాజు యాదవ్, రూరల్ మండల అధ్యక్షులు గంగిడి మహేందర్ రెడ్డి, నియోజకవర్గ ఐటీ & సోషల్ మీడియా కన్వీనర్ కోమండ్ల సప్తగిరి రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి గుడూరు సందీప్, పట్టణ ఉపాధ్యక్షులు శివాంజన్ సింగ్, పట్టణ యువ మోర్చ అద్యక్షులు అచ్చ దయాకర్, చెన్నరావుపేట మండల సోషల్ మీడియా కన్వీనర్ కీసరి సాంబరాజు, సీనియర్ నాయకులు పొదిల్ల రామ్ చందర్, యువ మోర్చా నాయకులు అన్వేష్, భవాని శంకర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments