Friday, September 20, 2024
Homeరాజకీయంకిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి శాఖల కేటాయింపు..

కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి శాఖల కేటాయింపు..

ఎవరికి ఏ శాఖ అంటే..?
స్పాట్ వాయిస్, బ్యూరో: దేశంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తరవాత మొదటిసారి మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్​లో చోటు దక్కించుకున్న కిషన్​రెడ్డికి బొగ్గు గనులశాఖ, బండి సంజయ్​కు హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు. కేంద్ర హోంశాఖ మళ్లీ అమిత్‌ షాను కేటాయించింది. రక్షణశాఖను రాజ్‌నాథ్‌ సింగ్​కు కేటాయించింది. నిర్మలా సీతారామన్​కు ఆర్థిక శాఖలోనే కొనసాగించేలా నిర్ణయాలు తీసుకుంది. చాలా వరకు సీనియర్​ నేతలకు పాత శాఖలను ప్రధాని నరేంద్ర మోడీ కేటాయించారు. కీలక శాఖలన్నీ బీజేపీ నేతలకే అప్పగించింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరవాత ఈ విషయంలో తొలి సంతకాన్ని పెట్టారు. పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా దేశంలో రూ.9.3 కోట్ల మంది రైతులకు రూ.2వేలు చొప్పున రూ.20వేల కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments