Saturday, May 24, 2025
Homeక్రైమ్పురుగుల మందు తాగి మహిళ వీఆర్ఏ ఆత్మహత్య

పురుగుల మందు తాగి మహిళ వీఆర్ఏ ఆత్మహత్య

స్పాట్ వాయిస్, క్రైం: జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మహిళ వీఆర్ఏ గురువారం పరుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల వీఆర్ఏ లను ప్రభుత్వం పలు శాఖలకు బదిలీలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రఘునాథపల్లి మండలానికి చెందిన సంధ్యాకిరణ్ అనే మహిళను లింగాల గణపురం నుంచి హైదరాబాదులోని బండ్లగూడెంకు జూనియర్ అసిస్టెంట్ గా బదిలీ చేశారు. అక్కడ పని ఒత్తిడి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments