Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుబోనమెత్తిన ఎంపీపీ, జెడ్పీటీసీ

బోనమెత్తిన ఎంపీపీ, జెడ్పీటీసీ

స్పాట్ వాయిస్, దామెర: పోచమ్మ బోనాల పండుగకు చివరి ఆదివారం కావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఊరూరా పోచమ్మతల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దామెర మండలంలోని ల్యాదేళ్ళ గ్రామంలో ఎంపీపీ కాగితాల శంకర్, మండల కేంద్రంలో జడ్పీటీసీ గరిగే కల్పనా కృష్ణమూర్తి మహిళలతో కలిసి పోచమ్మ తల్లికి బోనాలు చేశారు. డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడి,పశుసంపదతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments