Sunday, April 20, 2025
Homeక్రైమ్చిన్నారిని చిదిమేసిన స్కూల్‌ బస్

చిన్నారిని చిదిమేసిన స్కూల్‌ బస్

అన్నను స్కూల్‌ బస్ ఎక్కించేందుకు వచ్చిన చిన్నారి
భీమదేవరపల్లి మండలంలో ఘటన

స్పాట్ వాయిస్, భీమదేవరపల్లి :అన్నను స్కూల్ కు పంపించేందుకు పేరెంట్స్ తో వెళ్లిన మూడేళ్ల బాలుడిని మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దండవేన శరత్-మమత దంపతుల పెద్ద కుమారుడు సాన్విక్ గట్ల నర్సింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ప్రతి రోజు స్కూల్ బస్ లో పాఠశాలకు వెళ్తున్న అతడిని మంగళవారం ఉదయం బస్ ఎక్కించేందుకు చిన్న కుమారుడు శివాన్ష్ (3) కూడా పేరెంట్స్ తో కలిసి బస్ దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో శివాన్స్ ఒక్క సారిగా బస్ వద్దకు పరుగెత్తుకెళ్లాడని, గమనించకుండా డ్రైవర్ బస్సును కదిలించడంతో టైర్ల కింద పడిన శివాన్స్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments