Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుఅప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

స్పాట్ వాయిస్ నర్సంపేట, (నెక్కొండ): అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నెక్కొండ మండలంలో సోమవారం జరిగింది. మండలంలోని పనికెర గ్రామానికి చెందిన గార్నెపల్లి కోమల్ రెడ్డి (48) తనకున్న మూడు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల నుంచి పంట సరిగా దిగుబడి రాక మనస్తాపం చెందిన అతడు సోమవారం మధ్యాహ్నం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మరణించినట్లు తెలిపారు. అతని తండ్రి నరసింహారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై జానీ పాష తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments