Monday, April 21, 2025
Homeలేటెస్ట్ న్యూస్స్కూల్ బస్సును ఢీకొన్న పెద్ది స్వప్న వాహనం..

స్కూల్ బస్సును ఢీకొన్న పెద్ది స్వప్న వాహనం..

16 మంది పిల్లలకు గాయాలు..
స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే భార్య..
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సంపేట పట్టణంలోని ఫాతిఫైండర్ స్కూల్ కు చెందిన బస్సు కమలాపురంలో విద్యార్థులను దించి వస్తుండగా.. నల్లబెల్లి వైపు వెళ్తున్న జెడ్పీ ప్లోర్ లీడర్, నర్సంపేట ఎమ్మెల్యే భార్య పెద్ది స్వప్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. అలాగే పెద్ది స్వప్న స్పృహ కోల్పోయింది. కారు డ్రైవర్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణ నష్టం తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక గాయపడిన విద్యార్థులను హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలియగానే.. ఏసీపీ, సీఐ, ఇద్దరు ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments