Monday, May 26, 2025
Homeజిల్లా వార్తలుఎత్తైన ప్రాంతాల్లో ఉండాలి..

ఎత్తైన ప్రాంతాల్లో ఉండాలి..

నెక్కొండ ఎస్సై జానీ పాషా

స్పాట్ వాయిస్ నర్సంపేట,(నెక్కొండ): నెక్కొండ మండలంలోని ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై జానీ పాషా సూచించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పర్వతగిరి మండలంలోని ఇలుగుర్తి చెరువుకు పడడంతో వరద నీరు నెక్కొండ మండలంలోని ముంపు ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని ఎస్సై తెలిపారు. అందువల్ల నెక్కొండ పరిధిలోని చంద్రుగొండ,బంజరుపల్లి, ముదిగొండ పరిహార ప్రాంతాలలోనికి వరద నీరు వచ్చే ప్రమాదం ఉన్నందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వీలైనంత వరకు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఆయా గ్రామాలలోని యువకులు ఈత వచ్చినటువంటి జాలర్లు అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలతో తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments