Monday, May 26, 2025
Homeజిల్లా వార్తలుముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది

ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది

స్పాట్ వాయిస్ నర్సంపేట,(నెక్కొండ): మండలంలోని ముంపు ప్రాంతాలను గురువారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. సంగెం మండలం ఏలుగూరు రంగంపేట చెరువు గండిపడడంతో వట్టే వాగు వరద ఉధృతి పెరిగింది. నెక్కొండ తద్వారా చుట్టూ పక్కల ఉన్న గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని ఎమ్మెల్యే పెద్ది తెలుసుకొని చుట్టూ నివసిస్తున్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. మండలకేంద్రంలో వరద నీటితో మునిగిన పెట్రోల్ బంక్ ను పరిశీలించారు. అనంతరం పోలీస్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి రక్షణా చర్యలు వెంటనే చేపట్టాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులపై దృష్టి ఉంచి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments