Sunday, May 25, 2025
Homeజిల్లా వార్తలునర్సంపేట అతలాకుతలం

నర్సంపేట అతలాకుతలం

భారీ వర్షాలకు నర్సంపేట అతలాకుతలం

స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: గత మూడు రోజులుగా ఎడతెరిపిలేని లేకుడా కురుస్తున్న భారీ వర్షాలతో నర్సంపేట పట్టణం నీటి కూడలా మారిపోయింది. పట్టణానికి సమీపంలో ఉన్న మాదన్న పేట చెరువు పూర్తిస్థాయిలో నిండి మత్తెడ పోస్తుంది. దీంతో మాదన్నపేట వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. మాదన్నపేట వాగు ప్రవహంతో నల్లబెల్లి, నర్సంపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఎన్టీఆర్ నగర్ వాసులను కాలనీని కాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని హెచ్చారుస్తున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి కరెంట్ ఫోళ్ళు విరిగి మధ్య రాత్రినుంది పట్టణం అంధకారంలో ఉంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉంటూ అవసరం ఉంటే తప్ప ఇండ్ల నుండి బయటకు రావొద్దని, పాడు బడిన, కూలడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరు ఉండొద్దని హెశ్చరిస్తున్నారు. ఇదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో రెవెన్యూ సిబ్బందికి తెలియచేయాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments