రాష్ట్రం నుంచే సెక్యూరిటీ ఇవ్వాలని డీజీపీకి సూచన
స్పాట్ వాయిస్, హైదరాబాద్: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్య ఈటల రాజేందర్ భద్రతపై కేటీఆర్ ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్కు ఫోన్ చేసి ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్తో వెరిఫై చేయించాలని కేటీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుఫునే సెక్యూరిటీ ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. కేటీఆర్ ఆదేశాల నేపథ్యంలో భద్రత పెంపుపై డీజీపీ సమీక్ష చేయనున్నారు. ఈటల రాజేందర్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఈటల జమునా తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా..
RELATED ARTICLES
Recent Comments