Friday, September 20, 2024
Homeక్రైమ్హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

*హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం*
*నలుగురు స్పాట్ డెడ్*
*ఇద్దరి పరిస్థితి విషయం..*
*మేడారం తల్లుల దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన*
స్పాట్ వాయిస్, ఆత్మకూరు : హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం నీరుకుల్ల బ్రిడ్జి వద్ద జరిగిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోగా, కారు డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గ్రేటర్ వరంగల్ పరిధి కాశీబుగ్గ సొసైటీ కాలనీకి చెందిన వారంతా ఉదయం కారులో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు కాగా, తీవ్ర గాయాలపాలైన వారు కారులోనే ప్రాణాలు విడిచినట్లు స్తానికులు చెబుతున్నారు. కాగా, వారంతా గ్రేటర్ వరంగల్ పరిధి కాశీబుగ్గ సొసైటీ కాలనీకి చెందిన అనుముల నరసింహచారి, వెల్డండి సాంబరాజు, వెల్డెండి ఆకాంక్ష, వెల్దండి లక్ష్మి ప్రసన్నగా తెలుస్తోంది. కాగా, అనుముల రాజశ్రీ, అనుముల అక్షిత కు తీవ్రంగా గాయాలు కాగా, వారు ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో సొసైటీ కాలనీలో విషాధం నెలకొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments