Friday, September 20, 2024
Homeక్రైమ్రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య..

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య..

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య..

స్పాట్ వాయిస్, గీసుగొండ:చింతలపల్లి-వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య వంచనగిరి రైల్వే గేట్ సమీపంలో గుర్తు తెలియని యువకుడు గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.. మృతుడి వద్ద ఎస్ బీఐ ఏటీఎం కార్డు, ఏపీజీవీబీ ఏటీఎం కార్డులు లభించాయని.. దానిపై భూక్య సాయికుమార్ అనే పేరు ఉందని రైల్వే పోలీసులు తెలిపారు. అలాగ్ నర్సంపేట డిగ్రీ కాలేజ్ కి సంబందించిన హాల్ టికెట్ ముక్క ఉందని, దానిపై భూక్య సాయికుమార్ తండ్రి పేరు ఈర్య అని ఉందన్నారు. శవాన్ని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ మార్చురీ రూమ్ లో భద్రపరిచామని తెలిపారు. మృతుడు యాష్ కలర్ జీన్స్ ప్యాంటు, వైట్ అండ్ బ్లూ కలర్ చెక్స్ గల ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడని.. ఆ వ్యక్తి వివరాలు తెలిస్తే రైల్వే హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ (8712513861)ను సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments