Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్రూ.20 లక్షలు ఇస్తా.. రాజీ చేసుకో

రూ.20 లక్షలు ఇస్తా.. రాజీ చేసుకో

ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ వేధిస్తున్నాడు..
కన్నీరుపెట్టుకున్న జానకీపురం సర్పంచ్
నాభర్తను ట్రాప్ చేశారు..
వాళ్ల మాటలు నమ్మి ఇబ్బంది పెడుతున్నడు..
స్పాట్ వాయిస్, స్టేషన్ ఘన్ పూర్: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య-జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం తిరగదోడింది. గతంలో లైంగిక ఆరోపణలు.. ఆ వెంటనే కాంప్రమైజ్‌లు చకచకా జరిగిపోయాయి. అప్పుడు నిశబ్దంగా మారినట్టే అనిపించిన లొల్లి మళ్లీ ఎగిసిపడింది. కాపురంలో చిచ్చు దాకా వెళ్లింది. తాజాగా సర్పంచ్ నవ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజయ్యపై తాను చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించిన టేపులు ఇవ్వాలని ఆయన ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించింది. తనకు, తన భర్తకు మధ్య చిచ్చుపెట్టాలని రాజయ్య చూస్తున్నారని.. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రూ.20 లక్షలు ఇస్తానని.. రాజీ చేసుకోవాలని కొందరితో ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంది. అలాగే గతంలో తాను చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని బాండ్ రాసివ్వాలని బెదిరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నవ్య తెలిపారు. తన భర్తను ఓ మహిళా ప్రజాప్రతినిధితో ట్రాప్ చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజయ్య పీఏ మాటలు నమ్మి తన భర్త ప్రతిరోజూ వేధిస్తున్నాడని నవ్య వాపోయారు. ఎమ్మెల్యేపై ఆరోపణల తర్వాత తనకు సరైన గౌరవం దక్కడం లేదని.. వెలివేసినట్లుగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments